జగన్ 'పరామర్శ'
కడప : దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మారణ వార్త విని ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలని పరామర్శిస్తానని వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఏప్రిల్ రెండు వారం నుండి రాష్ట్రమంతటా పర్యటించి, ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని ఆయన చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన తరువాత ఆయన మాట్లాడారు. ప్రతీ ఇంట్లోనూ వై ఎస్ ఫోటో ఉందని, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ద్వారా ప్రజలు గుండెల్లో నిలిచిపోయారన్నారు. అటువంటి మహానుభావునికి కొడుకుగా జన్మించడం తన అదృష్టమని జగన్ పేర్కొన్నారు.
News Posted: 3 February, 2010
|