నెల్లూరు : నగరంలోని కాకర్ల వీధిలోని ఎస్వీఆర్ బులియన్ మార్కెట్లో సోమవారం చోరీకి గురైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీ కాళహస్తిలోని ఓ గుడి వద్ద లాకర్ లో సొమ్ముదాచిపెట్టినట్లు కనిపెట్టారు. దీంతో పోలీసులు దోపిడీకి నిందితులుగా అనుమానిస్తున్న నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ సాగిస్తున్నారు. దుకాణ యజమాని కె శ్రీనివాసులు తెలిపిన వివరాలు ప్రకారం పోలీసులు కేసు విచారణ సాగిస్తున్నారు.