ఏలూరు : జిల్లాలోని పాలకొల్లు రైతులు ఆందోళనకు దిగారు. ఎరువుల కొరతను నివారించాలంటూ గురువారం రైతులు ధర్నా చేసారు. సకాలంలో ఎరువులు సరఫరా చేయాలంటూ రైతులంతా నినదించారు. ఖాళీ సంచులతో తమ నిరసనను వ్యక్తం చేసారు. ప్రభుత్వం సక్రమంగా ఎరువులు సరఫరా చేయకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని రైతులంతా హెచ్చరించారు.