ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వర ఆలయంలో శుక్రవారం తోపులాటు చోటుచేసుకుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తడంతో తోపులాట జరిగింది. భక్తులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీలను ప్రయోగించారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు.