అనంతపురం : రాష్ట్రంలో సమైక్యాంధ్ర వాణిని వినిపిస్తున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ నెల 18 తేదీన అనంతకు వస్తారని జిల్లా జేఏసీ నేతలు వెల్లడించారు. ఆదే రోజు జిల్లాలో సమైక్యాంధ్ర సదస్సు నిర్వహిస్తారని తెలిపారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేతలను కూడా ఆయన కలుసుకుంటారని వివరించారు.