కడప : జిల్లాలోని లక్కిరెడ్డిపల్లెలో ఆదివారం ప్రారంభమైన గంగమ్మ జాతరలో అపశృతి చోటుచేసుకుంది. జాతరలో ప్రదర్శనకు వచ్చిన ఓ చాందిని బండికి కరెంటు తీగలు తగలడంతో విద్యుదాఘాతం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.