నిజామాబాద్ : రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇంటికి ఏబీవీపీ కార్యకర్తలు పిడకలు కొట్టారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు నేరుగా మంత్రి ఇంటికి చేరుకుని ఆందోళన చేపట్టారు. తెలంగాణకు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేసారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను శాంతింప చేసారు.