నెల్లూరు : జిల్లాలోని నాయుడుపేట మండలంలోని విన్నమాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో- లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.