అనంతపురం : పెంచిన ఎరువుల దరలను కేంద్రప్రభుత్వం తగ్గించాలని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరీ డిమాండ్ చేసారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై పెను భారాన్ని మోపుతున్నాయని ఆయన విమర్శించారు. ఎరువులు ఉత్పత్తి చేసే కంపెనీలపై పూర్తి నియంత్రణ అధికారాన్ని ప్రభుత్వాలే తీసుకోవాలని ఆయన కోరారు.