వైభవంగా పెద్దింట్లమ్మ జాతర
ఏలూరు : కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆదివారంనాడు సుమారు 60 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. జాతరలో భాగంగా అమ్మవారికి అష్టమావరణ, కలశార్చన, సహస్రనామ కుంకుమపూజ, పుష్పాలంకరణ, ధూపసేవ, బాలభోగం పూజలను నిర్వహించారు.
News Posted: 22 February, 2010
|