'లడ్డూ విక్రయాలు సక్రమమే'
శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానంలో చేపట్టిన లడ్డూల తయారీ, విక్రయాల్లో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని ఆలయ ఈఓ గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. విక్రయాలపై వచ్చిన ఆరోపణలపై విచారించి రికార్డులన్నీ తనిఖీలు చేసామని ఆయన వివరించారు. మొత్తం 28, 07, 165 లడ్డూ ప్రసాదాల్లో ఫిబ్రవరి 20 వ తేదీ నాటికి 27, 92,737 విక్రయించినట్లు తెలిపారు. నగదు రూ. 1,39,63,685లు దేవస్థానం ఖాతాలో జమ అయినట్లు ఆయన వెల్లడించారు.
News Posted: 24 February, 2010
|