'కలవరమాయే మదిలో' రివ్యూ
శ్రేయ (స్వాతి) తన తల్లి (ఢిల్లీ రాజేశ్వరి)తో కలిసి ఉంటూ ఓ ఆడిట్ ఆఫీసులో పనిచేస్తుంటుంది. శ్రేయకు పాడటం అంటే ప్రాణం. ఎప్పటికైనా ఎ.ఆర్.రెహమాన్ కంపోజిషన్ లో తాను పాడాలనేది ఆమె డ్రీమ్. అయితే శ్రేయ తల్లికి మాత్రం శ్రేయ సింగర్ కావాలనుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకు ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది లెండి. అమ్మ కోసం జాబ్ చేస్తూ డబ్బుల సంపాదన కోసం ఓ స్టార్ హోటల్ లో శ్రేయ పాటలు పాడుతుంటుంది. లండన్ తిరిగి స్వదేశానికి వచ్చిన శ్రీను (కమల్ కామరాజు) ప్రతిరోజూ ఆ హోటల్ లో శ్రేయ పాట వింటుంటాడు. అందరూ చప్పట్లు కొట్టినా అతను మాత్రం సైలెంట్ గా ఉండిపోతుంటాడు. ఇది శ్రేయకు నచ్చదు. అతనితోనే అమీతుమీ తేల్చుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్యా పరిచయం పెరుగుతుంది. శ్రేయ ఆశయానికి అతను ప్రోత్సాహం అందిస్తుంటాడు. సంగీత విద్యాంసుడైన రావు (విక్రమ్ గోఖలే) ఒకరోజు తన సహచరుడైన శాస్త్రితో (తనికెళ్ల భరణి) కలిసి ఆ హోటల్ కు వచ్చి శ్రేయ పాట వింటాడు. ఆగ్రహంతో ఊగిపోతూ 'నువ్వు పాడేది కూడా ఓ పాటేనా?' అని గద్దిస్తాడు. దీంతో శ్రేయ చిన్నబోతుంది. తనకు పాడటమే రాదన్న రావు వద్దే సంగీతం నేర్చుకోవాలని శ్రేయ నిశ్చయించుకుంటుంది. అయితే ఆమె కోరికను రావు తోసిపుచ్చుతాడు. సంగీతం నేర్పేదిలేదంటాడు. శాస్త్రిని మంచి చేసుకుని పనిపిల్లగా రావు ఇంట్లోకి శ్రేయ అడుగుపెడుతుంది. ఒకవైపు
శాస్త్రిని ఒప్పించేందుకు పడేపాట్లు, మరోవైపు శ్రీనును ఆకర్షించేందుకు చేసే ప్రయత్నాలతో కథ నడుస్తుంటుంది. షడన్ గా స్టోరీలో ఓ ఊహించని 'మలుపు' చోటుచేసుకుంటుంది. ఇక స్టోరీ ట్రాక్ మారుతుంది. శ్రేయను కలవర పరచిన ఆ ట్విస్ట్ ఏమిటి? రెహ్మాన్ కంపోజిషన్ లో పాడాలనే శ్రియ డ్రీమ్ ఎలా నెరవేరిందనేది మిగతా కథ.
స్వాతి తన పాత్రకు తగిన న్యాయం చేసింది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ఆకర్షణ శక్తి కూడా స్వాతే. ఫస్టాఫ్ లో కావాల్సినంత అల్లరి చేసిన స్వాతి ఇందుకు భిన్నంగా సెకెండాఫ్ లో భావోద్వేగాలతో కూడిన నటనను కూడా సమర్ధవంతంగా ప్రదర్శించింది. తండ్రి గురించి తెలిసిన తర్వాత రోడ్డు మీదకు వచ్చిన తనను తాను తమాయించుకునే ఘట్టం, తల్లిని అపార్థం చేసుకున్నందుకు ఆమె ఒళ్లో చేరి కంటతడి పెట్టే సన్నివేశంలో స్వాతి నటన మెచ్చుకోలుగా ఉంది. కమల్ కామరాజు తన పాత్రలో ఫరవాలేదనిపించుకుంటాడు. హెయిర్ స్టయిల్ , మంచి మెలోడీ సాంగ్ లో ఆయన చెక్కా విప్పేసి కండల ప్రదర్శన ఆకర్షణీయంగా లేవనే చెప్పాలి. మరాఠీ నటుడు విక్రమ్ గోఖలే హుందాగా తన పాత్రను పోషించారు. ఆయనకు ఎస్.పి.బాలసుబ్రమణ్యం చేత డబ్బింగ్ చెప్పించారు. విక్రమ్ గోఖలే అసిస్టెంట్ గా తనికెళ్ల భరణి సునాయాసంగా తన పాత్రను లాగించేశారు. ఆయన పాత్ర 'శంకరాభరణం'లో అల్లు రామలింగయ్య, 'సాగరసంగమం'లో శరత్ బాబు పోలికలతో ఉంది. స్వాతి తల్లిగా ఢిల్లీ రాజేశ్వరి, కమల్ కామరాజ్ తల్లిగా ప్రగతి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|