మల్లన్న' రివ్యూ
రెండేళ్ల పాటు శిల్పం చెక్కినట్టు చెక్కి ఇదిగో అదిగో అంటూ హైప్ సృష్టించిన సినిమాలు ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవడం ఆషామాషీ వ్యవహారం కాదు. డబ్బు మంచి నీళ్లులా ఖర్చుపెట్టే నిర్మాత దొరికినప్పుడు, స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఉన్నప్పుడు కథ, కథనాల విషయంలో సరైన జడ్జిమెంట్ ఉండాలి. అదొక్కటే సరిపోదు. ప్రెజెంటేషన్ లో కొత్తదనం ఉండాలి. యదృచ్ఛికమో, ఉద్దేశపూర్వకమో తెలియదు కానీ దర్శకుడు సుశీ గణేషన్ భారీ అంచనాలను సృష్టించిన 'మల్లన్న' సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు రాబిన్ హుడ్ తరహా చిత్రాల ప్రభావం ఎక్కువగా పడి కిచిడీ వంటకాన్ని తలపిస్తుంది. ఆర్థిక అసమానతలు పెరగడానికి, సమాజం అశాంతితో అల్లకల్లోలం కావడానికి డబ్బే (నల్లధనం) కారణమనీ, అక్రమమార్గాల్లో విదేశీ ఖాతాల్లో మునుగుతున్న వేల కోట్ల రూపాయలు వెలికి తేస్తే దేశంలో పేదరికం మటుమాయం అవుతుందనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. రాబిన్ హుడ్ తరహా హీరోయిజం. బ్యాట్ మన్ పోలికలు. రకరకాల గెటప్ లు. నల్లధనం, ఆర్థిక నేరాలు వంటి పాయింట్లతో వచ్చిన 'శివాజీ', హీరో తన ఫ్రెండ్స్ తో అవినీతిపరులపై నెట్ వర్క్ నడపిన 'ఠాగూర్', సమాజానికి మేలు చేయాలనుకునే తరహాలో ఇదే విక్రమ్ హీరోగా శంకర్ తీసిన 'అపరిచితుడు'...ఇలా పలు చిత్రాల పోకడలు 'మల్లన్న'ను కమ్మేశాయి. నల్లధనం దాచుకునే బదులు అది వైట్ చేసి పేదవాళ్లను, గ్రామాలను దత్తత తీసుకుంటే దేశంలో పేదరికమే ఉండదనే బ్రాడ్ కాన్సెప్ట్ మెచ్చుకుని తీరాలి. అయితే ఏమి చెప్పినా (చూపించినా) దిగువ తరగతి ప్రేక్షకుడు కూడా అర్ధం చేసుకునేలా ప్రెజెంటేషన్ ఉండాలి. లాప్ టాప్ పై చకచకా ఫారెన్ అకౌంట్లు తెరవడం, పాస్ వర్డ్ లు ఉపయోగించడం, హవాలా డబ్బు చేతుల మారడం వంటివి ఒకటి రెండు సెకండ్లలో జరిగిపోతుంటే ప్రేక్షకుడు గుటకలు మింగడం మినహా బుర్రలోకి ఎక్కించుకోలేడు. విజువల్ ఎక్సలెన్సీ అవసరమే కానీ దర్శకుడికి విజన్ అనేది ముఖ్యం. మల్లన్న విజన్...సినిమా తెరకెక్కిన వైనంలోకి వెళ్తే...
మల్లన్న (విక్రమ్) ఆర్థిక నేరాల విభాగంలో పనిచేసే సిన్సియర్ ఆఫీసర్. పేద ప్రజలు, వారి జీవితాలను మార్చి ఆర్థిక అసమానతలు రూపుమాపాలంటే నల్లధనం వెలికి తీయాలనీ, అక్రమార్జన చేసి పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న వారి వల్లే సమాజంలో చెడు ప్రబలుతోందని బలంగా నమ్ముతాడు. ఇందుకు ప్రత్నామ్యాయంగా రాబిన్ హుడ్ తరహాలో దేవుడు 'మల్లన్న'గా కోడిపుంజు తరహా మారువేషం వేసి పెద్దోళ్లను కొట్టి పేదలను ఆదుకుంటూ ఉంటాడు. శ్రీశైలం మల్లన్న గుడి ఆవరణలో ఉన్న చెట్టుకు ప్రజలు తమ ఆర్థిక సమస్యలను కాగితంపై రాసి వేలాడదీస్తే వారి సమస్యలు పరిష్కారమవుతుంటాయి. అంటే వారి అవసరాలను డబ్బు రూపంలో మల్లన్న తీరుస్తుంటాడు. ఆ డబ్బు వారికి అందజేయడంలో మల్లన్న స్నేహితులు సహకరిస్తుంటాడు. ఇది భగవంతుడు మల్లన్న చేస్తున్న సహాయంగానే ప్రజలు నమ్ముతూ రోజురోజుకూ గుడిలో బారులు తీరుతుంటారు. బ్యాంకులను కోట్లలో మోసం చేసి అక్రమార్జనతో కోట్ల కు పడగలెత్తిన పిపిపి అలియాస్ పొన్నుస్వామి (ఆశిష్ విద్యార్థి) పై ఒకరోజు సిబిఐ రైడింగ్స్ జరుగుతాయి. చాలా పెద్దమొత్తంలో బ్లాక్ మనీ పట్టుబడుతుంది. దాంతో మల్లన్నపై పొన్నుస్వామి పగబడతాడు. మల్లన్నను చంపించే ప్రయత్నాలు చేస్తాడు. పొన్నుస్వామి కుమార్తె సుబ్బలక్ష్మి సైతం తండ్రికి బాసటగా నిలబడి మల్లన్నపై ప్రతీకారం తీర్చుకునేందుకు అతని పట్ల ప్రేమ నటిస్తుంటుంది. మరోవైపు పేదలకు సహాయం చేస్తున్నది దేవుడు కాదనీ, మనిషనీ నిరూపించేందుకు ఇంటెలిజెన్స్ డిఐజి (ప్రభు) ఇన్వెస్టిగేష్ జరుపుతుంటాడు. విక్రమ్ ను తప్పుగా అర్థం చేసున్న సుబ్బలక్ష్మిలో ఎలాంటి ప్రవర్తన కలిగింది, మల్లన్న తన లక్ష్యాన్ని ఎలా సాధించాడనేదే మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|