'నిన్ను కలిశాక' రివ్యూ
సాంకేతికపరంగా బి.ఎల్.సంజయ్ ఛాయాగ్రహణం ముచ్చట గొలుపుతుంది. సునీల్ కాశ్వప్ సంగీతానికి కూడా ప్రశంసలు ఇవ్వొచ్చు. ఎందుకంటే సింగర్ల వాయిస్ ను సంగీతం డామినేట్ చేయలేదు. 'అందమైన అందమా ఓ చంద్రమా', 'మౌనం మనసుల్లోన భావం గుండెల్లోనా' పాటలు క్యాచీగా ఉన్నాయి. లక్ష్మీభూపాల్ సంభాషణల్లో అంతగా పస లేదు. 'ప్రేమలో పడ్డాక నువ్వు ఖర్చుపెట్టాలి..
పెళ్లయ్యాక నీ సొమ్ము నీ భార్య ఖర్చుపెడుతుంది' వంటి ఒకటి రెండు సంభాషణలు సందర్భోచితంగా ఉన్నాయి. గౌతంరాజు ఎడిటింగ్ ఓకే.
సినిమా ప్రథమార్థం సాదాసీదా వ్యవహారం. సరైన చోట విశ్రాంతి కార్డ్ పడకపోవడం కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచదు. ద్వితీయార్థం దీనికి కొనసాగింపుగానే నడక సాగించింది. చివర్లో దర్శకుడు ఇచ్చిన క్లైమాక్స్ సముచితంగా ఉంది. మొదటిసారి కలిగే ప్రేమే సరైన ప్రేమనీ, ఆ తర్వాత ఎందర్ని ప్రేమించినా అది ఆకర్షణేననీ, ఫస్ట్ లవ్ ఈజ్ ద బెస్ట్ లవ్..అనే ప్రేమసందేశం ఇచ్చారు. అయితే అప్పటికే కథ నేరేషన్ తో ప్రేక్షకులు అసహనంతో కొట్టుమిట్టాడే పరిస్థితికి చేరుకుంటారు. దీంతో జగపతిబాబు సైతం సేవింగ్ గ్రేస్ కాలేకపోయారు. ఓవరాల్ గా...ఉషాకిరణ్ ఊరించి ఉసూరుమనిపించింది.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|