'వాడే కావాలి' రివ్యూ
ప్రేమ కథలకు ఎప్పుడూ రెండే ముగింపులు ఉంటాయి. ఒకటి సుఖాంతం, రెండోది దుఃఖాంతం. నిజమైన ప్రేమ త్యాగాన్నే కోరుతుందనే కాన్సెప్ట్ కూడా బాగా పాతబడినదే. అయితే ఎన్ని ప్రేమ కథలు వచ్చినా ఆదరించే ప్రేక్షకులు ఉండటం వల్ల అవి ఎప్పటికీ ఎవర్ గ్రీనే. కాకుంటే...ఎవరు కథలెంచుకున్నా ముందు చెప్పుకున్న తానులోంచి తీసుకోవాల్సిందే. మళ్లీ మళ్లీ ప్రేమకథలే ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు కనీసం ట్రీట్ మెంట్ లో వైవిధ్యం ఉండేలా చూసుకోవడం అనివార్యమవుతుంది. అలా తీసిన 'చిత్రం', 'జయం' వంటి సినిమాలను ప్రేక్షకులను ఆదరించారు. దర్శకుడు రాజేంద్ర దర్శన్ ఇప్పుడు మరో ప్రేమకథా ఇతివృత్తంగా 'వాడే కావాలి' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. రొటీన్ ఫార్ములాలోనే కథ నడక సాగించారు. పెళ్లిళ్లు స్వరంలోనే జరుగుతాయనీ, ఆ జంటలను భగవంతుడు భూమిపైకి పంపించినప్పుడు ఎవరో ఒకరికి జ్ఞాపకం ఉండేలా రెండో వ్యక్తికి అది గుర్తు చేసేలా చేస్తాడనీ, ఇద్దరికీ గుర్తులేనప్పుడు ఆ శక్తి తల్లిదండ్రులకు ఇచ్చి ఆ జంటను కలుపుతారనే పాయింట్ తో కథ మొదలుపెట్టారు. అయితే...కథలోకి వెళ్లేటప్పటికి నమ్మకం...ప్రేమ అనే అంశాలను కీలకం చేస్తూ...చివరకు నమ్మకమూ కాదు, .ప్రేమా కాదు, ప్రేమలో నిలబడటమే గొప్ప అంటూ కమర్షియల్ (పాజిటివ్) కోణం నుంచే ముగింపు ఇచ్చేరు. హీరో సాయిరాం శంకర్ ఫెయిల్యూర్ల మధ్య నలుగుతున్న సమయంలో నటించిన ఈ చిత్రాన్ని...అంతకంటే ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బంపర్ ఆఫర్' చిత్రం తర్వాతే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. రామ్ శంకర్ గా ఆయన పేరు ఈ తాజా చిత్రం టైటిల్స్ లో వేయడం స్పష్టంగా కనిపిస్తుంది. 'బంపర్ ఆఫర్' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ శుక్రవారమే 'వాడే కావాలి' విడుదల కావడం యాదృచ్ఛికం కూడా కావచ్చు. రామ్..అలియాస్ సాయిరాం శంకరం మరోసారి ప్రేక్షకుల చేత 'వాడే కావాలి' అనిపించుకుంటాడా అనేది చూద్దాం...
ఆనంద్ (సాయిరాం శంకర్) లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేసే యువకుడు. తండ్రి ఆనందరావు (నరేష్) బాగా డబ్బున్న వ్యక్తి. కొడుకంటే పంచప్రాణాలు. అమ్మాయిలంతా తన చుట్టూ తిరుగుతున్నా మనసుకు నచ్చిన అమ్మాయి తారసపడినప్పుడే ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెబుతుంటాడు ఆనంద్. ఆ రోజు రానే వస్తుంది. వైజాగ్ బీచ్ లో లత (సుహాసి) అనే అందమైన అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. ఆమె కనిపించినట్టే కనిపించి మాయమయిపోతుంటుంది. ఎట్టకేలకు ఓ పెళ్లిలో ఆమెను చూసి మాటామాటా కలిపి తాను ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెబుతాడు. అయితే అందుకు లత విముఖంగా ఉంటుంది. ఇందుకు ఓ కారణం ఉంటుంది. తన చిన్న వయసులో ఓ గుడి దగ్గర తనకు పరిచయమై తనకు జ్ఞాపకంగా ఉంగరం ఇచ్చిన అభిరామ్ ఆమె మనసులో తిష్ట వేసుకుని కూర్చుండటమే ఆ కారణం. అభిరామ్ ఎప్పటికైనా తన కోసం తిరిగి వచ్చి తన చేయందుకుంటాడనేది ఆమె నమ్మకం. లతను గాఢంగా ప్రేమించిన ఆనంద్ ఆమె ప్రేమను పొందేందుకు తానే ఆమె చిన్ననాటి నేస్తమని అబద్ధం చెబుతాడు. లత సంతోషంగా అతని పెళ్లి ప్రపోజల్ కు ఒప్పుకుంటుంది. అయితే అబద్ధాలంటే లతకు గిట్టవని గ్రహించిన ఆనంద్ కొంత తర్జనభర్జనల తర్వాత తాను అభిరామ్ ను కాననీ, ఆమెపై తనకున్న ప్రేమ మాత్రం నిజమనీ చెప్పేస్తాడు. దాంతో అతన్ని లత చీదరించుకుంటుంది. లత ప్రేమ తనకు దక్కకపోయినా తన వల్ల డిస్ట్రబ్ అయిన ఆమెనూ, ఆమె నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఆనంద్ నిశ్చయించుకుంటాడు. ఈ క్రమంలో లతను అభిరామ్ దగ్గరకు చేర్చాలనుకుంటాడు. అతని ప్రయత్నం ఫలించి లత-అభిరామ్ కలుసుకున్నారా? లత నమ్మకం నిలిబడిందా...ఆనంద్ ప్రేమ గెలిచిందా? అనేది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|