ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
నిజామాబాద్ : ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం నిజామాబాద్ లో జరిగింది. స్థానిక సుధీర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో చదువుకుంటున్న నందిత అనే విద్యార్థిని తాను ఉంటున్న వసతిగృహంలోనే ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు ఏమిటనేది తెలియరాలేదు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని నందిత ఆత్మహత్యకు సంబంధించిన కూపీ లాగే పనిలో పడ్డారు. నందిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 26 February, 2009
|