ప్రసారకేంద్రంలో అగ్ని ప్రమాదం
కావలి : దూరదర్శన్ కేంద్రంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. కావలి దూరదర్శన్ కేంద్రం ఏసీ ప్లాంటులో ఒక్కసారిగా మంటలు రేగడంతో ప్రసారకేంద్రంలోని పలు కేబుల్స్, ఇతర ముఖ్య పరికరాలు దెబ్బతిన్నాయి. దాదాపు 20 లక్షల రూపాయల మేర ఆస్థి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు వాచ్ మెన్ తప్ప మరెవరూ లేకపోవడంతో ఏ చేయాలో తోచని వాచ్ మెన్ నెల్లూరులోని ఉన్నాతాధికారులకు తెలియేశాడు. వారి సలహా ప్రకారం ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు.
News Posted: 25 May, 2009
|