విజయవాడ : జి.కొండూరు మండలం కొండపల్లి వద్ద నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ పనుల్లో ప్రమాదం జరిగి ముగ్గురు కార్మికులు మృతి చెందగా మరికొంత మంది గాయపడ్డారు. మైటాస్ ఆధ్వర్యంలో నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ రెండవ దశ నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. గత రాత్రి నిర్మాణంలో వున్న మూడవ ఫ్లోర్ పై కప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో దానికింద పనిచేస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగానే వారిలో ముగ్గురు మృతి చెందారు.