మఫ్టీ పోలీస్ గా పనిచేయండి
వరంగల్ : ప్రతి పౌరుడూ మప్టీ పోలీస్ గా పనిచేయాలని వరంగల్ జిల్లా ఎస్పీ వి.సి.సజ్జనార్ పిలుపునిచ్చారు. శుక్రవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సజ్జనార్ మాట్లాడుతూ పోలీస్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తుందని ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దన్నారు. సంఘ విద్రోహ శక్తుల విద్రోహ చర్యలకు తావివ్వకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మసీదులు, దేవాలయాలు, చర్చిలు, మాల్స్, సినిమాహాల్స్ మరియు ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలున్నందున ఆయా ప్రాంతాలలో నిఘా పెంచినట్లు సజ్జనార్ చెప్పారు. ప్రజలు ఆందోళనకు గురి కావద్దన్నారు. పరిచయం లేని వ్యక్తులు తారసపడితే వెంటనే 100, 1090 నెంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని ఆయన కోరారు. ప్రజలు, పోలీసులు ఐకమత్యంతో పనిచేసి సంఘ విద్రోహులను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈసమావేశంలో డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, సీపీఐలు దక్షిణామూర్తి, మురళీధర్, ఎస్సై ఫణిచందర్ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 5 June, 2009
|