విజయవాడ : ఓ ఎరువుల గోడౌన్ లో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కృష్ణాజిల్లా కలిదిండిలో ఓ ఎరువుల గోడౌన్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో 50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చని అనుకుంటున్నారు.