విజయవాడ : కృష్ణాజిల్లా వత్సవాయిలో బావి పూడికతీత పనుల్లో గురువారం విషాదం నెలకొంది. బావిలో పూడిక తీస్తుండగా విషవాయులు వెలువడడంతో ఆక్సిజన్ అందక ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.