విజయవాడ : హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని మనస్థానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని నోవా ఇంజనీరనంగ్ కళాశాల హాస్టల్ లో ఓ విద్యార్థిని గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సుప్రియ కళాశాల హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుంది. మృతురాలు ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కాగా తండ్రి మందలించాడని మనస్థాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.