అగ్నికి ఆహుతైన 25 గుడిసెలు
విజయవాడ : కృష్ణానది కరకట్టపై గొల్లపూడి వద్ద బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 5 లక్షల రూపాయల పైగా ఆస్తి నష్టం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు వరుసగా అన్ని గుడిసెలకు వ్యాపించాయి. ఉదయం కావడంతో పెద్దవారు పనులకు వెళ్ళగా పిల్లలు భయపడి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 25 గుడిసెలు పైగా పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న సబ్ కలెక్టర్ ఉప్పల్ సహా, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, గొల్లపూడి సర్పంచ్ సుబ్బారావులు కట్టుబట్టలతో మిగిలిన బాధితులను పరామర్శించారు.
News Posted: 24 June, 2009
|