దుర్గమ్మకు బంగారు బిస్కెట్లు
విజయవాడ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకనకదుర్గ అమ్మవారికి ఓ అజ్ఞాత భక్తుడు 84 బంగారు బిస్కెట్లను హుండీ ద్వారా కానుక సమర్పించాడు. వీటి విలువ కోటి 25 లక్షల రూపాయలు ఉండవచ్చని ఆలయ అధికారులు పేర్కొన్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే ఈ బంగారాన్ని కొనుగోలు చేశాననీ, ఆదాయపు పన్ను కూడా చెల్లించానని ఆ భక్తుడు ఈఓకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ బంగారాన్ని ఆలయ తాపడం పనులకు ఉపయోగించాలని ఆ భక్తుడు ఈఓకు రాసిన లేఖలో కోరాడని ఆలయ అధికారులు తెలిపారు.
News Posted: 27 June, 2009
|