గుడివాడ కౌన్సిల్లో గందరగోళం
విజయవాడ : కృష్ణాజిల్లా గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్, టిడిపి కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం పై ఈ సభ్యుల మధ్య వాగ్వివాదం నెలకొంది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.
News Posted: 30 June, 2009
|