విజయవాడ : ఓ పరుపుల గోడౌన్ లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. హనుమాన్ పేటలోని ఓ పరువుల గోడౌన్ లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంధి అగ్ని మాపక దళానికి సమాచారాన్ని అందించింది. వెంటనే రంగంలోకి దిగిన ఫైరింజన్ సిబ్బంది మంటలను ఆర్పడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. షార్క్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.