కృష్ణాజిల్లా : కృష్ణాజిల్లా మొవ్వలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గాదేపూడి నుంచి కోసూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ప్రసాద్ ను ఢీ కొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కాళ్ళపారాణి ఆరకుండానే అతనికి నిండు నూరేళ్ళు నిండిపోయాయి. నెలరోజుల క్రిందటే ప్రసాద్ కు వివాహమైంది. ప్రసాద్ మరణ వార్త విన్న భార్య భోరున విలపిస్తోంది. అతని మరణ వార్తతో ఆ కుటుంబలో విషాద ఛాయలు అలుముకున్నాయి.