విజయవాడ : విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు ఆవరణలో శుక్రవారం ఓ నిందితుడు బ్లేడుతో గొంతుకోసుకున్న సంఘటన కలకలాన్ని రేపింది. శ్రీనివాస్ అనే వ్యక్తి ఓ కేసులో నిందితుడిగా జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నాడు. ఈ రోజు విచారణ నిమిత్తం అతన్ని సెషన్స్ కోర్టుకు తీసుకుని వచ్చారు. జైల్లో తనను వేధిస్తున్నారంటూ అతను బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో గాయపడిన అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.