కొండపైకి వాహనాల నిషేధం
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీకనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వస్తున్నవాహనచోదకులు పోలీసుల ఆదేశాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటనను దృష్టిలో ఉంచుకొని నగర పోలీసులు ఇందకీలాద్రిపైకి శనివారం మధ్యాహ్నం నుంచి వాహన రాకపోకలను నిషేధించారు. దీనితో భక్తులు కాలినడకనే కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకోవలసి వస్తోంది. వృద్దులు, చిన్నారులు కొండపైకి ఎక్కలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.
News Posted: 18 July, 2009
|