విజయవాడ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా భక్తులు తెల్లవారు జామునుంచే అమ్మవారి దర్శనానికి తరలిరావడంతో నాలుగు గంటలనుంచే సర్వదర్శనం మొదలైంది. తెల్లవారు జామున నిర్వహించే సుప్రభాతం అనంతరం ప్రాత:కాల అర్చన తదుపరి నాగులు గంటల నుంచి ఐదు గంటలవరకు కనకదుర్మకు ఖడ్గమాల పూజను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక నగలతో అలంకరించారు. శ్రావణమాసం సందర్భంగా శుక్రవారాల్లో అమ్మవారిని ప్రత్యేక నగలతో అలంకరిస్తామని ఆలయన అర్చకులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికరుల ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.