విజయవాడ : పటమట పోస్టల్ కాలనీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న కిరణ్ స్నేహితుని బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.