వరంగల్ : కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా... ఎక్కడో ఒక చోట ఆ తాలుకా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలోని నిట్ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిపై ద్వితీయ సంవత్సరానికి చెందిన విద్యార్థుల బృందం గత రాత్రి ఓ జూనియర్ విద్యార్థిని నిర్భిందించి ర్యాగింగ్ కు పాల్పడ్డారు. దీంతో అతను కళాశాల పాలక మండలికి ఫిర్యాదు చేయడంతో పూర్తి విచారణ జరిపి ఈ ఘటనకు పాల్పడిన వారపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.