కటంగూరు కన్నుమూత
(వేముల సదానందం)
వరంగల్ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సీనియర్ పాత్రికేయుడు, విశ్వజ్యోతి మాసపత్రిక సంపాదకులు కటంగూరు నర్సింహారెడ్డి (86) సోమవారం తుదిశ్వాస విడిచారు. కీ.శే కటంగూరు రమణారెడ్డి దంపతలకు 1923వ సంవత్సరం అక్టోబర్ 16న జన్మించారు. ఇంటర్ మీడియట్ వరకు విద్యాభ్యాసం చేసిన నర్సింహారెడ్డి 1938-39లోనే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆర్య సమాజ్ చేపట్టిన పౌరహక్కుల ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1947 సెప్టెంబర్ 2న పరకాలలో నిజాం పోలీసులు జరిపిన కాల్పుల్లో 23 మంది సమరయోదులు వీరమరణం పొందారు. వందలాది మంది గాయపడ్డ సంఘటనలో కటంగూరు సహాయంగా పాల్గొన్నాడు. మరో జలియన్ వాలా బాగ్ ను తలపించిన ఈ సంఘటన తరువాత నర్సింహారెడ్డి అజ్ఞాన జీవితం గడిపారు.
గెరిల్లా శిక్షణను మహారాష్ట్రలోని చాందా క్యాంపులో, నాగపూర్ లో మిలటరీ శిక్షణ పొంది 1947-48 సంవత్సరంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రజాకార్లపై జరిగిన సాయుద పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. సాయుధ పోరాటానికి అవసరమైన ఆయుదాలు, మందుగుండు సామాగ్రిని సమకూర్చుకోడంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా విర్రూర్, పారుపల్లి, కరీంనగర్ జిల్లాలోని రొంపికుంట, మహాదేవ్ పూర్, వరంగల్ జిల్లాలోని చంద్రగిరి,బుద్దారం పోలీస్ స్టేషన్లపై చేసిన దాడుల్లో నర్సింహారెడ్డి పాల్గొన్నారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ మార్గ దర్శకత్వంలో చంద్రగిరి హిల్స్ లో గెరిల్లా యుద్ధ స్థావరాన్ని ఏర్పాటు చేసి స్వాతంత్ర్య సమరయోదులకు క్యాంపు ఇన్ చార్జిగా బాద్యతలు నిర్వహించారు. అంతేకాకుండా ఆయుద శిక్షణ ఇచ్చి చంద్రగిరి క్యాంపును బలమైన ఉద్యమ మార్గంగా రూపుదిద్ది నిజాం పోలీసులు, మిలటరీ దళాలపై దాడులు నిర్వహించారు.
Pages: 1 -2- News Posted: 12 August, 2009
|