ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని కొయ్యల గూడెం రాజవరం వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వారిని గుర్తించారు. వీరంతా విశాఖపట్టణానికి చెందిన వ్యవసాయ కూలీలని వారు తెలిపారు.