సంచార పశు వైద్యశాల
విజయవాడ : రైతుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన సంచార పశు వైద్యశాల వల్ల వేలాది రూపాయలు విలువచేసే పశువులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుతున్నాయి. కృష్ణా మిల్క్ యూనియన్ జిల్లాలోని రైతుల కోసం గత నెలలో వీటిని ప్రారంభించింది. వాహనాల ద్వారా జిల్లాలోని 843 గ్రామాలను సందర్శించి 5,021 కేసులను సిబ్బంది పరీక్షించారు. అలానే పశువులకు గొంతు వాపు, గాలికుంటు వ్యాధలకు సంబంధించి టీకాలను ఉచితంగా వేసినట్లు యూనియన్ ఇన్ చార్జి మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. వివిధ సంస్థలు, చారిటబుల్ ట్రస్ట్ ల సహకారంతో తొలివిడతగా ఐదు వాహనాలను సమకూర్చారు. సంచార పశు వైద్య శాల సేవలను గుర్తించిన ల్యాంకో ఫౌండేషన్ రెండు వాహనాలను యూనియన్ కు సమకూర్చనుంది. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచార వైద్యశాలలను బహూకరించేందుకు ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇవి సెప్టెంబర్ నాటికి సమకూరుతాయన్నారు. విజయవాడతో పాటు పామర్రు, చిల్లకల్లు, హనుమాన్ జంక్షన్, తిరువూరులలో వైద్యశాలల సేవలను అందిచనున్నారు. అనేక గ్రామాల్లో పశువైద్యశాలలు లేకపోడవడం, సిబ్బంది కొరత వల్ల పశువులకు సైరన వైద్యం చేయించలేక రైతులు నష్టపోతుండడంతో సంచార వైద్యశాలలను ప్రవేశపెట్టారు.
News Posted: 24 August, 2009
|