10న వైఎస్ సంతాప సభ
విజయవాడ : గుడివాడలోని నెహ్రూ చౌక్ లో ఈనెల 10న దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మృతికి సంతాప సూచికంగా కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు శేగు వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు గుడివాడలోని నెహ్రూచౌక్ లో సంతాప సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సర్పంచ్ లు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, మాజీ మంత్రులు, జెడ్పీ చైర్మన్లు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ బీసీ సెల్ అధ్యక్షలు, కార్యకర్తలు, అన్ని పార్టీల నాయకులు పాల్గొని ప్రియతమ నేతకు నివాళులు అర్పించాలని శేగు కోరారు.
News Posted: 8 September, 2009
|