ప్రమాదంలో టీడీపీ నేత మృతి
విజయవాడ : ఎంబీసీ విద్యాసంస్థల అధినేత, తెలుగుదేశం నాయకుడు ఆలూరి బుచ్చయ్య చౌదరి మంగళవారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. పెనుగ్రంచిపోలు మండలం నవాబ్ పేటలో ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు నిరసన తెలుపుతూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ఇది హత్యేనంటూ వారు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సంఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. బుచ్చయ్య మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News Posted: 15 September, 2009
|