'వ్యాధులను అదుపులో ఉంచండి'
(వేముల సదానందం)
వరంగల్ : జిల్లాలో వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఉన్నాధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. బుధవారం ఆయన సచివాలయం నుండి టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ తో పాటు వైద్యాధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగితెలుసుకున్నారు. జిల్లాలో ఏఏ ప్రాంతాల్లో వ్యాధులు ప్రభలాయి? మంతమంది బాద పడుతున్నారు, మరెంత మంది వ్యాధుల కారణంగా మరణించారు? వ్యాధులు ప్రభలకుండా ముందస్తు చర్యలు ఏమిటి? ఏజెన్సీ ప్రాంతాలలో పరిస్థితి ఎలా ఉంది? తదిదర అంశాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. స్వైన్ ఫ్లూ సోకిందనే అనుమానంతో నాలుగు కేసులను పరిశీలనకు పంపగా కేవలం ఒకటి మాత్రమే పాజిటివ్ గా తేలిందని కలెక్టర్ శ్రీధర్ మంత్రికి వివరించారు. జనగామ మండలానికి చెందిన సంతోషి అనే గృహిణి తన తల్లి గారింటిలో ఉప్పల్ లో రెండు నెలలుగా ఉంటూ అక్కడే వ్యాది భారిన పడి ఆమె మృతి చెందిందని శ్రీధర్ వివరించారు. జిల్లాలో ఇప్పటికే 10 వేల మాస్కులు, 7200 టామిప్లూ మందులను అందుబాటులో ఉంచామని ఆయన మంత్రికి తెలిపారు. మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో అధికారులు చేపట్టిన చర్యల వల్ల వ్యాధులు అదుపులో ఉండడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
News Posted: 17 September, 2009
|