ట్రాక్టర్ బోల్తా : నలుగురు మృతి
వరంగల్ : స్టీరింగ్ పై పట్టు తప్పిపోవడంతో ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు వ్యక్తులు మరణించారు. వరంగల్ జిల్లా మొగుళ్ళపల్లి మండలం దొడ్లపల్లిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్టీరింగ్ పై డ్రైవర్ పట్టుకోల్పోవడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, వాహనాన్ని సీజ్ చేశారు.
News Posted: 21 September, 2009
|