కొండపైకి వాహనాలు రద్దు
విజయవాడ : దసరా ఉత్సవాల్లో మూలానక్షత్రం సరస్వతీ దేవి అలంకారాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఘాట్ రోడ్ లో ఎటువంటి వాహనాలను శుక్ర, శనివారాల్లో అనుమతించమనీ, వృద్ధులు, వికలాంగులకు, వీఐపీలు, ప్రెస్ ల కోసం ఏర్పాటు చేసిన వాహనాలను కూడా ఈ రెండు రోజులు నడపమని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు గురువారమే విస్తృత స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ప్రతి వంద మీటర్లకొక చోట క్యూలలో ప్రత్యేక బాక్సులుగా ఏర్పాటు చేయనున్నారు. అంటే ముందున్న భక్తులు అమ్మవారి దర్శనానికి వెళ్లారనుకుంటే గాని వెనక ఉన్న భక్తులను క్యూలోంచి వదలరు. భక్తులు ఎవరినైనా సరే వినాయకుడి వద్ద ప్రవేశం ద్వారానే అనుమతించే ప్రయత్నం జరుగుతుందన్నారు. దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రోశయ్య శుక్రవారం విజయవాడ వస్తున్న సందర్భంగా విస్తృత స్థాయి ఏర్పాట్లుచేసినట్లు జిల్లా కలెక్టర్ పీయూష్ కుమార్ తెలిపారు. సీఎం రోశయ్య శుక్రవారం సాయంత్రం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
News Posted: 24 September, 2009
|