ఘర్షణలో ఒకరు మృతి
వరంగల్ : స్థానిక గ్రామ పంచాయతీ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబాబాద్లోని మాదాపురం గ్రామంలో కాంగ్రెస్, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసు కుంది. ఈ సంఘటనలో టీడీపీ సానుభూతిపరుడు గువ్వల బిక్షం మృతి చెందగా, కాంగ్రెస్కు చెందిన నర్సయ్య తీవ్రంగా గాయపడటంతో చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
News Posted: 15 October, 2009
|