మారు మ్రోగిన శివనామం
విశాఖపట్నం : ఓం నమ:శివాయ అంటూ భక్తులు చేసే శివనామ స్మరణతో శివాలయాలు ప్రతిధ్వనిస్తున్నాయి. కార్తీక మాసం అందునా రెండో సోమవారం కావడంతో నగరంలోని శివాలయాలు భక్తులో కిటకిటలాడాయి. పరమేశ్వరుని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పలు దేవాలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వన్ టౌన్, జగదాంబ సెంటర్, అక్కయ్యపాలెం, హనుమంతవాక, న్యూకాలనీ, మద్దెలపాలెం తదితర ప్రాంతాలలోని శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.
News Posted: 27 October, 2009
|