త్యాగం కాదు నివాళి : సురేఖ
వరంగల్ : మంత్రి పదవికి రాజీనామా చేసిన సురేఖ తొలిసారిగా వరంగల్ కు వెళ్ళడంతో అక్కడ పెంబర్తి వద్ద కార్యకర్తలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన రాజీనామా త్యాగం కాదనీ, తనను ఈ స్థాయికి తెచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఇచ్చిన నివాళి అని కొండా అన్నారు. ప్రజల అభిప్రాయాన్ని తెలిపేందుకే తాను రాజీనామా చేశానని, 2010లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆమె అభిప్రాయపడ్డారు.
News Posted: 11 November, 2009
|