వరంగల్ : వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో సోమవారం ఉద్రిక్త వాతారణం నెలకొంది. పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థులు భారీ ప్రదర్శన చేప్టటారు. అయితే పరీలను వాయిదా వేయడానికి వీసీ నిరాకరించడంతో అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో దాడికి ప్రయత్నించారు. సీఎం రోశయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు పోలీసులపై రాళ్ళ వర్షం కురిపించారు. దీంతో అక్కడి వాతావరణంతా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.