విజయవాడ : ఇంద్రకీలాద్రి పై కొలువున్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రేపటి నుంచి భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఈవో ఎన్ విజయకుమార్ తెలిపారు. భవానీ భక్తులంతా మార్గశిర బహుళ సప్తమి నుండి ఏకాదశి వరకు దీక్షల విరమణ చేసేందుకు దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసిందని అన్నారు. దీక్షల విరమణ రోజుల్లో శతచండీ యాగం జరుగుతుందన్నారు.