అమ్మవారి హుండీ లెక్కింపు
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవానీలు సమర్పించిన కానుకలను రెండు విడతలుగా లెక్కించారు. ఈ హుండీలో భక్తులు సమర్పించిన కానుకలు మొత్తం 91.72 లక్షల రూపాయల నగదు, 327 గ్రాముల బంగారం, 14.918 కేజీల వెండి కానుకలు వచ్చినట్లు దుర్గగుడి ఈవో విజయకుమార్ తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే భక్తుడు 31 గ్రాముల బంగారు గాజులు సమర్పించగా, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కందుల సత్యనారాయణ అనే భక్తుడు అరకిలో వెండి కిరీటాన్ని అమ్మవారికి బహూకరించినట్లు ఆయన తెలిపారు.
News Posted: 18 December, 2009
|