వరంగల్ : తెలంగాణకు మద్దతుగా ములుగు టిడిపి ఎమ్మెల్యే సీతక్క నాలుగు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు గురువారం భగ్నం చేశారు. సీతక్క ఆరోగ్యం క్షీణించడంతో ఒక్కసారిగా పోలీసులు శిబిరానికి చేరుకొని ఆస్పత్రికి తరలించారు. సీతక్కను ఆస్పత్రికి తరలించే ముందు పోలీసులను టిడిపి కార్యకర్తలు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా కార్యకర్తలు సమీపంలోని దుకాణాలపై దాడులు చేశారు. దాడులకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.