వరంగల్ : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు జాప్యానికి నిరసనగా ఆ ప్రాంత ఉద్యోగులు పెన్ డౌన్ చేసారు. దాదాపు 65 సంఘాలు కలసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. సోమవారం నుండి రెండు రోజుల పాటు ఈ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నిర్ణయించింది. దీంతో సోమవారం తెలంగాణ జిల్లాల్లో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ పూర్తిగా స్థంబించిపోయాయి. ఉద్యోగులు ఈ నిరసన దినాల్లో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించరాదని జేఏసీ పిలుపునిచ్చింది.