ఏలూరు : జిల్లాలోని పోలవరం మండలం టేకూరు సమీపంలో ఫైబర్ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది వరకు గల్లంతయ్యారు. బోటు టేకూరు నుండి కొరుటూరు వెళుతుండగా పూడిపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ బోటులో 20 మంది ప్రయాణీకులు ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ప్రయాణీకులంతా టేకూరుకు చెందివ వారు. వీరంతా పాపికొండలు విహార యాత్రకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మార్వో ఘటనా స్థలానికి బయలుదేరారు.