హైదరాబాద్ : తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమేనని చీరాల ఎమ్మెల్య్ ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. గిట్టనివారే తనపే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చీరాలలో ఓ ఇంటిని కబ్జా చేశానన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.
అది ముగ్గురు అన్నదమ్ముల మధ్యా ఆస్తి తగాదా మాత్రమేనన్నారు. న్యాయం చేయమని సోదరులు తనను ఆశ్రయించారని ఆయన తెలిపారు. మానవ హక్కుల కమిషన్ విచారణలో వాస్తవాలు బయటపడతాయన్నారు. సెటిల్ మెంట్లకు తాను చాలా దూరమని వివరించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని తానే అడుగుతున్నానని ఆయన అన్నారు.